దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి

దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ రికార్డులను పరిశీలించిన సీపీ మహంతి
  • దుండిగల్​ పోలీసులపై సీపీ ఫైర్

దుండిగల్, వెలుగు: దుండిగల్ పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్​ మహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్​కేసుల వివరాలు తెలుసుకుని సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకు పెండింగ్​పడుతున్నాయని ప్రశ్నించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ వెంట మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, సీఐ సతీశ్, ఎస్సైలు ఉన్నారు.